రాష్ట్రానికి మంచి చేయాలన్నదే నా ఆరాటం..
‘తెలుగువాళ్లం ఎక్కడ ఉన్నా సరే ఇచ్చి పుచ్చుకునే గుణం ఉండాలి. కలిసి పని చేసుకునే వాతావరణం ఉండాలి. ఒకరికి తోడుగా మరొకరు నిలబడాలి. నిజంగా ఆ భావన రావడం సంతోషం. తెలుగు రాష్ట్రాల భావితరాల ప్రయోజనాల కోసమే శ్రీశైలం, నాగార్జునసాగర్లకు గోదావరి జలాలను తరలించాలని నేను.. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించాం. తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను తరలిస్తే అవి మన వరకూ వస్తాయా? అంటూ ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన సందేహాలు సహేతుకమైనవే. నిజంగా నీళ్లు రావు అనుకున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి ఎందుకు ముందడుగు వేయాలని అనుకుంటారు? మనం తీసుకునే నిర్ణయం వల్ల భావితరాలపై ప్రభావం ఉంటుంది. నిర్ణయం తీసుకోకపోవడం కూడా భావితరాలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని మరచి పోకూడదు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు