శంషాబాద్‌లో మరో మహిళ దహనం!

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డిపై అత్యాచారం, హత్య ఘటనను మరువక ముందే శంషాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రియాంకను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన ప్రాంతానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓ వివాహిత శుక్రవారం రాత్రి హత్యకు గురైంది. శంషాబాద్‌లోని సిద్దులగుట్టకు వెళ్లే మార్గంలో ఉన్న కట్ట మైసమ్మ ఆలయం పక్కన రాత్రి 8 గంటల సమయంలో మంటలు వస్తుండటంతో అటుగా వెళ్తున్న కొందరు గమనించి దగ్గరకు వెళ్లారు. ఓ మహిళ మృతదేహం కాలుతుండటంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే ‘100’కు సమాచారం అందించారు. అప్పటికే ఆ మహిళ ముఖం, చేతులతోపాటు దుస్తులు కాలిపోయాయి. ఆమె కాళ్లకు మెట్టెలు ఉన్నాయి. మృతదేహం వెల్లికలా పడి ఉండగా నాలుక బయటకు ఉంది. దీన్నిబట్టి దుండగులు ఆమెను హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top