ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం
అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్లుగా శాసన సభ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ శాసనసభలో చరిత్రలో ఇదో చారిత్రాక దినమని స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అనంతరం శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు