నవ సంకల్పం
వీలైనంత తక్కువ భూసేకరణ, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుంచి, ఎలా తరలించాలి, అలైన్మెంట్ ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన వివిధ ప్రత్యామ్నాయ మార్గాలపై సీఎంలిద్దరూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం 5.10 గంటలకు ప్రగతి భవన్ చేరుకోగా రాత్రి 9 గంటల వరకు చర్చలు సాగాయి. తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా కారు వద్దకు వచ్చి ఏపీ సీఎంకు సాదర స్వాగతం పలికారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు