దొంగ దీక్షపై చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్న విషయం మరోసారి రుజువైందని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు చేపట్టిన 420 దీక్షే అందుకు నిదర్శనమన్న ఆయన... బాబుకు ఆ అంటే అంధ్రజ్యోతి అని.. ఈ అంటే ఈనాడు అని ఎద్దేవా చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన అంబటి. చంద్రబాబు ఒక్కపూట దీక్ష.. తదితర పరిణామాలపై స్పందించారు.  

‘చంద్రబాబు తన దీక్ష కోసం రూ.30 కోట్లు ఖర్చు చేశారు. సొంత డబ్బు ఖర్చు పెడితే ఫర్వాలేదు. కానీ, ఆయన ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ఇది అన్యాయం కాదా?. పైగా దీక్ష పేరిట 1000కి పైగా ఆర్టీసీ బస్సులను వినియోగించారు. మొన్న బంద్‌ సందర్భంగా ఆర్టీసీకి రూ.21 కోట్లు నష్టం వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. మరీ చంద్రబాబు దీక్షకు వినియోగించిన ఆర్టీసీ సేవలతో నష్టం వాటిల్లలేదా?అధికారులు సైతం పనులు మానుకుని దీక్షలో కూర్చున్నారు. స్వప్రయోజనాలే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నది ఈ అంశంతో నిరూపితమైంది. దీక్షతో నాకింత బలముందుని చూపించుకున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనకు మద్ధతు ఇవ్వలేదు.ఎందుకంటే అది దొంగ దీక్ష అని అందరికీ తెలుసు కాబట్టి. ఐదు కోట్ల ఏపీ ప్రజలకు బాబు క్షమాపణలు చెప్పాల్సిందే’ అని అంబటి పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top