అగ్రిగోల్డ్‌ బాధితుల మరో సమరం

తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై అగ్రిగోల్డ్‌ బాధితులు మరో సమరానికి సన్నద్ధమవుతున్నారు. గత మూడున్నరేళ్లుగా దశలవారీగా ఉద్యమాలు చేపట్టిన బాధితులు ఇకపై వివిధ రూపాల్లో పోరాటాలకు కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలో 19.52 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నారు. పైసా పైసా కూడబెట్టి, అగ్రిగోల్డ్‌లో పెడితే ఉన్నదంతా ఊడ్చుకుపోయిందని, ఇక తాము ఎలా బతకాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను మోసం చేసిన అగ్రిగోల్డ్‌ యజమానులు బెయిల్‌పై బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారని, రూ.లక్షలు నష్టపోయిన తాము న్యాయం కోసం రోడ్డెక్కితే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మండిపడుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ‘స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌’ ఏర్పాటు చేసి, తమను ఆదుకోవచ్చని, అయినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top