స్కూల్ బస్సు బోల్తా..
ప్రైవేటు స్కూల్ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టిన ఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమింది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40మంది విద్యార్థులు ఉన్నారు. లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. గాయాలపాలైన విద్యార్థులను వరంగల్లోని ఎంజీఎంకు తరలిస్తున్నారు. బస్సు డీసీ తండా నుంచి వర్ధన్నపేటలోని స్కూల్కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు