స్కూల్‌ బస్సు బోల్తా..

ప్రైవేటు స్కూల్‌ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టిన ఘటన వరంగల్‌ జిల్లా వర్థన్నపేటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమింది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తున్న లారీ డ్రైవర్‌ ఎదురుగా వస్తున్న స్కూల్‌ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40మంది విద్యార్థులు ఉన్నారు. లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. గాయాలపాలైన విద్యార్థులను వరంగల్‌లోని ఎంజీఎంకు తరలిస్తున్నారు. బస్సు డీసీ తండా నుంచి వర్ధన్నపేటలోని స్కూల్‌కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top