సిద్దిపేట, దుబ్బాక ప్రజలు చాలా గట్టివాళ్లు
సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. 'సిద్దిపేట జిల్లా కావాలనుకుని సాధించాము. చాలా హుషారైన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీకు పనులు బాగా జరుగుతున్నాయి. రేపటి తెలంగాణలో వ్యవసాయం ఏవిధంగా ఉండబోతుందో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలకు చెప్పాలి. సిద్దిపేట, దుబ్బాక ప్రజలు చాలా గట్టివాళ్లు. అనుకున్నయి సాధిస్తారు. నేను మీరు పెంచిన బిడ్డనే. ఈ రోజు ఇక్కడికి అతిథిగా వచ్చి మాట్లాడుతున్నా. నేను చదువుకున్న దుబ్బాక హైస్కూల్ భవనాన్ని కూడా బ్రహ్మాండంగా కడుతున్నాము. హరీశ్రావు, రామలింగారెడ్డిలను లక్ష చొప్పున భారీ మెజారిటీతో గెలిపించాలి' అని కేసీఆర్ అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు