కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’!
అలనాటి మహానటి సావిత్రి పాత్రలో తనదైన నటనతో మెప్పించి అందరితో శభాష్ అనిపించుకోవడమే కాదు.. జాతీయ ఉత్తమనటి అవార్డును కీర్తి సురేష్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న తెలుగు చిత్రమిదే. ఈ చిత్రం యూరప్లో భారీ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా టైటిల్ను అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు