మమ్మల్ని ప్రలోభపెట్టారు
టీఆర్ఎస్లో చేరాలని తమ పార్టీ ఎమ్మెల్యేలను తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ప్రలోభపెట్టి ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ముగ్గురు నేతల కాల్ డేటా విచారిస్తే నిజాలు తేలుతాయని పేర్కొన్నారు. బుధవారం రాత్రి పార్టీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గాంధీ, రాజేందర్రెడ్డి, వివేకానందతో కలసి బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్క్వార్టర్స్లో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ను కలిసేందుకు వెళ్లారు. ఆయన లేకపోవడంతో ఏసీబీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, వివేకానంద తరఫున ఫిర్యాదు అందజేశారు. టీఆర్ఎస్లో చేరాల్సిందిగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు తమను ప్రలోభపెట్టారని ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఫిర్యాదులో పేర్కొం టూ ఏయే తేదీల్లో తమకు ఫోన్లు వచ్చాయో వెల్లడించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు