బొత్సతో సిఎం రమేష్ భేటీ: కుమ్మక్కు నిర్ధారణ

కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు బట్టయలయ్యాయి. దానికి సంబంధించిన రుజువులు కూడా ఈరోజు లభించాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో టిడిపి ఎంపి సిఎం రమేష్ ఈ సాయంత్రం సమావేశమయ్యారు. వీరిద్దరూ దాదాపు గంటకుపైగా సమావేశమయ్యారు.

జిఆర్జి రోడ్డులోని క్వార్టర్ నెంబరు 30 బొత్స సత్యనారాయణ సతీమణి ఎంపి ఝాన్సీ అధికార నివాసం. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సిఎం రమేష్ ఆ ఇంట్లో ఉండగా మీడియా ప్రతినిధులు చూశారు. సిఎం రమేష్ బెంజి కారులో వచ్చినట్లు తెలుస్తోంది. మీడియా వారు చూడటంతో ఆ కారును ఖాళీగా పంపించారు. ఆయన మీడియా కంటపడకుండా వెళ్లడానికి విశ్వప్రయత్నం చేశారు. ఆ ఇంటి నుంచి 5 గంటల ప్రాంతంలో స్విప్ట్ కారులో అయిదుగురు బయటకు వెళ్లారు. ఆ కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. ఆ కారులో సిఎం రమేష్ కూడా ఉన్నారు.

ఖచ్చితంగా కేంద్ర మంత్రి మండలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపే సమయంలోనే వీరిద్దరు సమావేశం కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top