నల్లగొండ కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో చాపకింద నీరులా ఉన్న విభేదాలు గాంధీభవన్ సాక్షిగా బట్టబయలయ్యాయి. నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులతో టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం నాడు ఓ సమావేశం నిర్వహించారు.
అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడంపై ఎప్పటినుంచో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు