చోరీ కేసులో ఐదుగురి అరెస్ట్
కడప అర్బన్ : కడప నగరంలోని విశ్వం థియేటర్లో వున్న ఆప్లిఫియర్స్, మోటార్లు, కరెంటు వైర్లు, బ్యాటరీలు, దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప ఒన్టౌన్ సీఐ వి.చిన్నపెద్దయ్య అన్నారు. శుక్రవారం కడప ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు తెలియజేశారు. చోరీ కేసులో నిందితులుగా కడప నగరం కోటగడ్డ వీధికి చెందిన షేక్ తబ్రిష్, బిస్మిల్లానగర్కు చెందిన షేక్ ఉమర్, వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ సద్దాం హుసేన్, చిలకలబావి వీధికి చెందిన షేక్ ముర్ఫత్ఖాన్, రవీంద్రనగర్కు చెందిన షేక్ గౌస్పీర్లు వున్నారన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కడప నగరంలోని మూతపడిన విశ్వం థియేటర్లోకి అక్రమంగా ప్రవేశించి సామగ్రిని దొంగలించారన్నారు. వీరిని గుర్రాలగడ్డ వీధి జెండాచెట్టు వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రికవరీ చేసిన వస్తువులలో కరెంట్ వైర్లు కరిగించి తీయగా వచ్చిన కాపర్ వైరు, రెండు బ్యాటరీలు వాటి విలువ సుమారు రూ.70,000 వుంటుందన్నారు. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కడప ఒన్టౌన్ సీఐ వి. చిన్నపెద్దయ్య, ఎస్ఐ ప్రతాప్రెడ్డి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ, ఎస్ఐతోపాటు హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్, కానిస్టేబుళ్లు బాల చంద్ర, ఎన్.చిన్న నారాయణరెడ్డి, ఎల్వీ ప్రసాద్లను డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు అభినందించారు.


