రాయలసీమలో తగ్గిన నేరాల సంఖ్య
జమ్మలమడుగు రూరల్ : రాయలసీమలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని రాయలసీమ జైళ్లశాఖ డీఐజీ ఎంఆర్ రవి కిరణ్ పేర్కొన్నారు. గురువారం జమ్మలమడుగు పట్టణంలోని సబ్జైలును ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గొడవల వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. దీంతో నేరాల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీఎస్పీ ఎం. గురుశేఖర్రెడ్డి, జైలర్ అమీర్ బాషా, జైలు సూపరింటెండెంట్ హర్షవర్దన్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
యువతి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ కలహాలతో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన గురువారం పట్టణంలో జరిగింది. చంద్రాకాలనీలో కాపురం ఉంటున్న రూబియా(25) కుటుంబ సభ్యులతో గొడవపడి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.


