జగనన్నకు ధన్యవాదాలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను అమలులో పెడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. వ్యవసాయ రంగానికి ఆయన పెద్దపీట వేస్తున్నారు. యంత్ర సేవా పథకం ద్వారా రాయితీ అందుకోవడం మా అదృష్టం. – గజ్జెల పెద్ద వేమారెడ్డి, గోపవరం, ప్రొద్దుటూరు మండలం
రైతులకు స్వర్ణయుగం
రైతు భరోసా సాయాన్ని వరుసగా ఐదేళ్లు అందుకోవడంతోపాటు యంత్ర సేవా పథకం సబ్సిడీలు కూడా పొందడం ఆనందంగా ఉంది. దీంతో వ్యవసాయం పట్ల రైతులకు మరింత దీమా పెరుగుతోంది. సీఎం వైఎస్ జగన్ పాలన రైతుల పాలిట స్వర్ణయుగంగా చెప్పవచ్చు.
– మన్సూర్ అహ్మద్, ఖాదర్పల్లె, చాపాడు మండలం
తలెత్తుకుని జీవిస్తున్నాం
వైఎస్ జగన్ సీఎం అయ్యాక రైతులు తలెత్తుకుని జీవించే పరిస్థితి ఏర్పడింది. దేశమంతా కరోనా తాండవించిన సమయంలోనూ రైతుల సంక్షేమాన్ని సీఎం విస్మరించలేదు. రైతుల కోసం యంత్ర సేవ లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తుండడం అభినందనీయం.
–నరసింహారెడ్డి, ఊడవగండ్ల, తొండూరు మండలం
నష్టాల నుంచి బయటపడ్డాం
రైతు భరోసాతోపాటు యంత్ర సేవా పథకం వల్ల రైతులకు వ్యవసాయ పెట్టుబడి వ్యయం తగ్గింది. దీంతో మేము నష్టాల నుంచి బయటపడగలిగాం. ఇచ్చిన హామీల కంటే రైతులకు అదనంగా సాయం చేయడం సంతోషదాయకం. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. – ఉమ్మడి హరి, మాధవరం, సిద్దవటం మండలం