గుర్తుతెలియని వ్యక్తి హత్య

- - Sakshi

చింతకొమ్మదిన్నె : కడప–రాయచోటి ప్రధాన రహదారిలోని బుగ్గలేటిపల్లి సమీపంలో వంకలో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి పెట్రోల్‌ పోసి కాల్చినట్లు కడప రూరల్‌ సీఐ అశోక్‌రెడ్డి, సీకె దిన్నె ఎస్‌ఐ భూమా అరుణ్‌రెడ్డిలు తెలిపారు. వారు తెలిపిన సమాచారం మేరకు మేకల కాపర్లు శుక్రవారం పశువులను మేపుకునేందుకు వంక వద్దకు వెళ్లగా అక్కడున్న ముళ్లపొదల్లో శవాన్ని గుర్తించారు. వెంటనే సీకె దిన్నె పోలీస్‌ ష్టేషన్‌కు సమాచారం అందించారు.పోలీసులు వెళ్ల మృత దేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇతన్ని హత్య చేసి ఆటో సహాయంతో వాగు వద్ద ఉన్న ముళ్లపొదల్లో పడేసి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించి ఉంటారని సీఐ, ఎస్‌ఐ తెలిపారు. మృతుడి వయస్సు 30–35 వరకు ఉంటుందని, కుడి చేతిపై కె. సుహాసిని అనే పచ్చబొట్టుతో పాటు, మృతుడు గ్రీన్‌ కలర్‌ గల్ల చొక్కా, బ్లూ ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించామన్నారు. మృతుడి షర్ట్‌కు ఉన్న కాలర్‌పై 5స్టార్‌ టైలర్స్‌ అని ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 91211 00525, 91211 00526 నంబర్లకు సమాచారం అందించాలన్నారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top