దిశ ఎస్ఓఎస్కు మహిళ ఫిర్యాదు
ప్రొద్దుటూరు క్రైం : ఒక వ్యక్తి తనను వెంబడిస్తూ ఫోటోలు తీశాడని ఒక మహిళ దిశ ఎస్ఓఎస్కు కాల్ చేసింది. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు గుర్తు తెలియని ఒక వ్యక్తి తనను వెంబడించి ఫోటో తీశాడని గురువారం రాత్రి శ్రీనివాసనగర్కు చెందిన ఒక మహిళ దిశ ఎస్ఓఎస్కు కాల్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు వచ్చేలోపే అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాలం చెలిన వాహనాలు సీజ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : 15 సంవత్సరాలు దాటిన వాహనాలపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద పరిగణించాలని రవాణాశాఖకు అదేశాలు జారీ చేయడంతో అధికారులు వాటిని సీజ్ చేస్తున్నారు. కాలం చెల్లిన వాహనాల్లో ఎక్కువగా మినరల్ వాటర్ తరలించే ఆటోలు ఉన్నాయి. సీజ్ చేసిన వాహనాలను రవాణాశాఖ కార్యాలయంలో ఉంచారు.