గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు శుక్రవారం తెలిపారు. మృతుడికి సుమారు 45 సంవత్సరాలు వయస్సు ఉంటుందన్నారు. పింక్ కలర్ ఫుల్ చొక్కా, కలర్ లుంగీ ధరించి ఉన్నాడని, గడ్డం ఉందని తెలిపారు. ఇతన్ని ఎవరైనా గుర్తు పడితే ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
తప్పిన ప్రమాదం
అట్లూరు : కడప–బద్వేలు ప్రధాన రహదారిపై త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, స్థానికుల కథనం మేరకు బద్వేలు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు కడప నుంచి బద్వేలు వెళుతూ అట్లూరు క్రాస్రోడ్డులో ఆగింది. ప్రయాణికులను దింపుతుండగా ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్ బస్సును క్రాస్ చేసే క్రమంలో ఎదురుగా ట్రాక్టరు వస్తుండడంతో టిప్పర్ డ్రైవర్ బ్రేక్ వేసి నిలిపివేశాడు. బస్సుకు, ట్రాక్టర్కు మధ్యలో టిప్పర్ దూరడం వల్ల బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే మూడు వాహనాలు రోడ్డుపై ఆగి పోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అట్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించారు. వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు.
అప్పుల బాధతో ఆత్మహత్య
పెద్దముడియం : మండలంలోని దిగువ కల్వటాల గ్రామంలో గువ్వల గురప్ప(54)అనే రైతు అప్పుల భాదతో ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గురప్పకు భార్య,ఇద్దరు కుమారులు,కుమార్తె ఉన్నారు. తన సొంత భూమి 2.5 ఎకరాలు, కౌలుకు 5 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.గతంలో పంటలు సరిగా పండకపోవడం,ఈ ఏడాది అకాల వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నటంతో రూ.10 లక్షల మేర అప్పు అయింది.అప్పులు ఇచ్చిన వారు బత్తిడి చేయడం, తీర్చలేనేమోనని మనోవేదనతో గురువారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్నాడు.భార్య రామలక్షుమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.