బైక్ను ఢీ కొన్న లారీ : ఇద్దరికి గాయాలు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక మోడంపల్లె బైపాస్ రోడ్డులో బైక్ను లారీ ఢీ కొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు రామేశ్వరానికి చెందిన రాజశేఖర్, ఎర్రగుంట్ల మండలంలోని అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడు శుక్రవారం ప్రొద్దుటూరులోని సినీహబ్ సమీపంలో పురుగుల మందుతో పాటు ఇతర వ్యవసాయ సామగ్రి కొనుగోలు చేశారు. వీరిద్దరూ బైక్లో మోడంపల్లె ద్విచ వెళ్తున్న సమయంలో ఎదురుగా ఆటో రావడంతో బైక్ను స్లో చేశారు. అదే సమయంలో వెనుక వైపు నుంచి వస్తున్న లారీ వారి బైక్ను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గా యపడిన సుబ్బరాయుడు మెరుగైన చికిత్స కోసం క డప జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.