
యాదగిరీశుడికి సువర్ణ పుష్పార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పర్వాల్లో భాగంగా స్వామి, అమ్మవారికి సువర్ణ పుష్పార్చన నేత్రపర్వంగా చేపట్టారు. ఆలయ ముఖ మండపంలోని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి సువర్ణ పుష్పాలతో ప్రజలు చేశారు. అంతకుముందు వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. అనంతరం ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.