హక్కుల సాధనకుసంఘటితంగా పోరాటం | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకుసంఘటితంగా పోరాటం

Jun 9 2025 8:02 AM | Updated on Jun 9 2025 8:02 AM

హక్కు

హక్కుల సాధనకుసంఘటితంగా పోరాటం

వనపర్తిటౌన్‌: హక్కుల సాధన కోసం భవన నిర్మాణ, ఇతర 54 రంగాల కార్మికులు సంఘటితంగా పోరాడాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోటం రాజు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా నాలుగో మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. సంక్షేమ బోర్డులో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించి నిధులు విడుదల చేయాలని, 60 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల పింఛన్‌, ఇళ్లు లేని వారికి నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్ల రద్దుకు జూలై 9న దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెలో అందరు కార్మికులు పనులు నిలిపివేసి పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు పుట్టా ఆంజనేయులు, అధ్యక్షుడు గంధం మదన్‌, జిల్లా కార్యదర్శి బొబ్బిలి నిక్సన్‌, ఉపాధ్యక్షులు డి.కురుమయ్య, కె.వెంకటయ్య, చెన్నారం శ్రీను, బాలస్వామి, రాబర్ట్‌, బాలరాజు, నాగరాజు, కార్మికులు పాల్గొన్నారు.

పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి : బీజేపీ

వనపర్తిటౌన్‌: పురపాలికలో పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కృషి చేయాలని.. త్వరలో వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు శ్రమించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ కోరారు. ఆదివారం పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఉందేకోటి అంజి, జి.ఉపేందర్‌ యాదవ్‌, కాటమోని రాణిగౌడ్‌, అశ్విని గోవింద్‌, ప్రధాన కార్యదర్శులుగా దంతోజు నవీన్‌చారి, అరవింద్‌, కార్యదర్శులుగా కడమంచి శివ, అశ్విని, పవన్‌, మందడి మనీషా, రేణుక, పట్టణ కోశాధికారిగా కూన శ్రీకాంత్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా వంశీ యాదవ్‌, కార్యవర్గ సభ్యులుగా వసంత్‌కుమార్‌రెడ్డి, కిషోర్‌కుమార్‌, ఉందేకోటి వెంకటేష్‌, శ్రీకాంత్‌, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం పుర ఎన్నికలకు సిద్ధం కావాలని, పార్టీ శ్రేయస్సుకు శ్రమించాలన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని, సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజేందర్‌రెడ్డి, పట్టణ ఇన్‌చార్జ్‌ బి.శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర సహ కోశాధికారి జ్యోతి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కుమారస్వామి, వెంకటేశ్వర్‌రెడ్డి, సీతారాములు, మాజీ అసెంబ్లీ కన్వీనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్‌ల సమస్యల

పరిష్కారానికి కృషి

వనపర్తి: గ్రామస్థాయి నుంచి వచ్చిన తనకు జర్నలిస్ట్‌ల సమస్యలు తెలుసని.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేయడంతో పాటు జీవిత బీమా చేయిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని.. స్నేహపూర్వకంగా ఎవరి ఆత్మగౌరవం దెబ్బతీయకుండా స్వేచ్ఛా వాతావరణంలో పాలన అందిస్తానని వివరించారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులు నిజాలు, సమస్యలను నిర్భయంగా రాయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా మిగిలిన జిల్లా, మండలాల ప్రెస్‌క్లబ్‌ స్థలం, భవన నిర్మాణం, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాల కేటాయింపు, రాజీవ్‌ యువశక్తి పథకం వర్తింపునకు తాను బాధ్యత తీసుకుంటానని భరోసానిచ్చారు. అనంతరం జర్నలిస్టులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు స్పందిస్తూ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నియోజవర్గంలోని అన్ని మండలాల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

హక్కుల సాధనకుసంఘటితంగా పోరాటం 
1
1/2

హక్కుల సాధనకుసంఘటితంగా పోరాటం

హక్కుల సాధనకుసంఘటితంగా పోరాటం 
2
2/2

హక్కుల సాధనకుసంఘటితంగా పోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement