గౌడ కులస్తుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

వనపర్తి క్రైం: గౌడ కులస్తుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గౌడ సంఘం కన్వీనర్‌ పలుస రమేశ్‌గౌడ్‌, కో–కన్వీనర్‌ సురేష్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు బండారు శ్రీనివాస్‌గౌడ్‌ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా పాన్‌గల్‌ రోడ్‌లో గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని, ఎలమ్మ ఆలయ నిర్మాణం, విద్యార్థుల వసతిగృహ నిర్మాణానికి రెండెకరాల భూమి కేటాయిస్తానని చెప్పారు. జిల్లాకేంద్రంలో త్వరలో సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలం, ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కృపానందం, మధుసూదన్‌, మ నోహర్‌గౌడ్‌, సారథిగౌడ్‌, కృష్ణగౌడ్‌ పాల్గొన్నారు.

మంత్రి నిరంజన్‌రెడ్డి

Read latest Wanaparthy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top