తీరొక్క పందిళ్లు.......

 సిర్సనగండ్లలో పుస్తెలతాడు చూపిస్తున్న వేదపండితుడు  - Sakshi

తీరొక్క పందిళ్లు.. మేళతాళాలు.. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ జిల్లావ్యాప్తంగా గురువారం సీతారాముల కల్యాణం కనులపండువగా జరిగింది. జిల్లాకేంద్రంలోని పలు ఆలయాలతో పాటు విశ్వక్సేన గోశాలలో 250 గోవుల మధ్య భక్తిశ్రద్ధలతో రాములోరి కల్యాణం జరిపించారు. జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన కల్యాణానికి మంత్రి నిరంజన్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి పాల్గొన్నారు. అలాగే నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో వేడుకలకు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. – వనపర్తి క్రైం

– మరిన్ని వివరాలు 9లో

Read latest Wanaparthy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top