మార్గశిర మాసోత్సవాల పందిరి రాటకు ఆహ్వానం
మహారాణిపేట : మార్గశిర మాసోత్సవాల నేపథ్యంలో శనివారం జరగనున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి పందిరి రాట మహోత్సవానికి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఆలయ ఈవో కె.శోభారాణి, ఇతర అధికారులు, అర్చకులు కలెక్టర్ను గురువారం తన చాంబర్లో కలిసి ఆహ్వాన పత్రికను, అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి ఆహ్వానం పలికారు. అమ్మవారి ఆలయంలో శనివారం మార్గశిర మాసోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


