ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Oct 27 2025 7:04 AM | Updated on Oct 27 2025 7:04 AM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మహారాణిపేట: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సోమ, మంగళ, బుధవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు, పెనుగాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

● ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణాలు రద్దు చేసుకోవాలి.

● గాలులు వీచే సమయంలో చెట్ల కింద, హోర్డింగ్‌ల సమీపంలో నిలబడవద్దని కోరారు. పల్లపు ప్రాంతాలు, కొండ వాలు ప్రాంతాలు, నది ఒడ్డున నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి

● మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, వేటకు వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలి

● సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీచ్‌లలో స్నానాలకు దిగవద్దు

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే విధంగా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, 0891–2590102 , 0891–2590100 నంబర్లకు ఫోన్‌ చేసి తెలియజేయాలని కలెక్టర్‌ ప్రజలకు సూచించారు. రైతులు సైతం వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement