
కై లాసగిరిని సందర్శించిన ఇస్రో చైర్మన్
ఆరిలోవ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ నారాయణన్ శుక్రవారం కై లాసగిరిని సందర్శించారు. గురువారం సాయంత్రమే నగరానికి చేరుకున్న ఆయన.. తన పర్యటనలో భాగంగా కైలాసగిరిని సందర్శించారు. ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి కొండలు, సముద్రం అందాలను తిలకించిన నారాయణన్.. కై లాసగిరిపై నిర్వహిస్తున్న జిప్లైన్, స్కై సైక్లింగ్ వంటి అడ్వెంచర్ కార్యకలాపాలను ఆసక్తిగా పరిశీలించారు. వాటితో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గ్లాస్ బ్రిడ్జి అడ్వెంచర్ను కూడా పరిశీలించారు. వాటి నిర్వహణ గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివపార్వతుల విగ్రహాల వద్ద, పలు విభాగాలకు చెందిన అధికారులతో కలిసి ఫొటోలు దిగారు.