
కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లకు సత్కారం
మహారాణిపేట: గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించినందుకు గానూ కలెక్టర్ హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్లను సింహాచలం దేవస్థానం ఈవో వి. త్రినాథరావు ఘనంగా సత్కరించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఈవో వేండ్ర త్రినాథరావు, ఈఈ సీహెచ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్,జీవీఎంసీ కమిషనర్కు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.