ఎస్జీఎఫ్‌ జిల్లా క్రికెట్‌ టోర్నీ విజేతగా తాండూరు | - | Sakshi
Sakshi News home page

ఎస్జీఎఫ్‌ జిల్లా క్రికెట్‌ టోర్నీ విజేతగా తాండూరు

Nov 23 2025 9:31 AM | Updated on Nov 23 2025 9:31 AM

ఎస్జీఎఫ్‌ జిల్లా క్రికెట్‌ టోర్నీ విజేతగా తాండూరు

ఎస్జీఎఫ్‌ జిల్లా క్రికెట్‌ టోర్నీ విజేతగా తాండూరు

తాండూరు టౌన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఆఫ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన అండర్‌–14 జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నీలో తాండూరు జట్టు విజేతగా నిలిచింది. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌, పెద్దేముల్‌, మోమిన్‌పేట్‌ జోన్ల మధ్య జరిగిన పోటీల్లో తాండూరు, వికారాబాద్‌ జట్లు ఫైనల్‌కు చేరాయి. శనివారం నిర్వహించిన ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వికారాబాద్‌ జట్టు పది ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తాండూరు జట్టు మూడు ఓవర్లు మిగిలి ఉండగానే, రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ టోర్నీలో తాండూరు జట్టు క్రీడాకారులు కీపర్‌, కెప్టెన్‌ కనవ్‌ పండిట్‌ 94 పరుగులు, ఆల్‌ రౌండర్‌ రిశ్విత్‌చంద్ర 77 పరుగులు, అభిలాష్‌ 10 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ టోర్నీలో జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అనంతయ్య, టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ కృష్ణమూర్తి, పీఈటీలు అంబదాస్‌, ఖాజా, నర్సింలు, రాజేందర్‌ రెడ్డి, గోపాల్‌, రాజేందర్‌, రాజు, మధు, కోచ్‌ విజయ్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. ఫైనల్‌లో విజేతగా నిలిచిన తాండూరు జట్టు క్రీడాకారులను అందరూ అభినందించారు.

అండర్‌–14 విభాగంలో ఎనిమిది వికెట్ల తేడాతో వికారాబాద్‌ జట్టుపై విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement