డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ జాదవ్
వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ధారాసింగ్ జాదవ్ నియమితులయ్యారు. శనివారం ఏఐసీసీ విడుదల చేసిన జిల్లా అధ్యక్షుల జాబితాలో ఆయనకు చోటు లభించింది. వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన గతంలో పలుమార్లు పెద్దేముల్ ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. ఆయన భార్య తారాబాయి పెద్దేముల్ సర్పంచ్గా పనిచేశారు. 1988లో పెద్దేముల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1991లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పని చేశారు. 1995లో ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొంది ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2001లో జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2012లో ఎఫ్ఏసీఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. డీసీసీబీ డైరక్టర్గా పనిచేశారు. 2019లో జెడ్పీటీసీగా గెలుపొందారు. 2022 నుంచి ఇప్పటి వరకు పీసీసీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జెడ్పీటీసీ సభ్యుల్లో ఆయనొక్కరే గెలుపొందారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ధారాసింగ్ జాదవ్ పేరు తెచ్చుకున్నారు.


