క్షయపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

క్షయపై అప్రమత్తత అవసరం

Jul 19 2025 1:11 PM | Updated on Jul 19 2025 1:11 PM

క్షయపై అప్రమత్తత అవసరం

క్షయపై అప్రమత్తత అవసరం

బంట్వారం: క్షయ వ్యాధిపై అప్రమత్తత అవసరమని కోట్‌పల్లి పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ మేఘన అన్నారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోట్‌పల్లి మండలం మోత్కుపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు టీబీ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పలువురిని వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేశామన్నారు. వ్యాధికి గురైనట్లు నిర్ధారిస్తే ఆరు నెలలపాటు ఉచితంగా మందులతోపాటు నెలకు రూ.వేయి అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ ఖయూం, ఎంఎల్‌హెచ్‌పీ దివ్య, ఏఎన్‌ఎం నర్సమ్మ, టీబీ యూనిట్‌ రాజేందర్‌, అశోక్‌, ఎల్టీ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

టీబీని నిర్మూలిద్దాం

దౌల్తాబాద్‌: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పీహెచ్‌సీ వైద్యాధికారిణి అమూల్య సూచించారు. టీబీ ముక్త భారత్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కుదురుమళ్లలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అమూల్య మాట్లాడుతూ.. క్షయ వ్యాధి ఉన్న వారికి జ్వరం, దగ్గు, నీరసం బరువు తగ్గడం లక్షణాలు ఉంటాయన్నారు. ఈ శిబిరంలో 210 మందికి పరీక్షలు చేయగా 12 మందిని అనుమానితులుగా గుర్తించారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ భీమ్‌శంకర్‌, మాధవి, రాహత్‌ ఏఎన్‌ఎం పుష్పలత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

మెడికల్‌ ఆఫీసర్‌ మేఘన

మోత్కుపల్లిలో అవగాహన సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement