ఖబరస్తాన్‌ కబ్జాను అడ్డుకోండి | - | Sakshi
Sakshi News home page

ఖబరస్తాన్‌ కబ్జాను అడ్డుకోండి

Jul 11 2025 12:52 PM | Updated on Jul 11 2025 12:54 PM

బషీరాబాద్‌: ముస్లింలకు చెందిన ఖబరస్తాన్‌ స్థలంలో కబ్జాలను అడ్డుకోవాలని మైల్వార్‌కు చెందిన మైనార్టీలు గురువారం తహసీల్దార్‌ షాహెదాబేగంకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని 235 సర్వేనంబర్‌లోని 4.35 ఎకరాల భూమిలో 70 ఏళ్లుగా ఖబరస్తాన్‌ కొనసాగుతోందని తెలిపారు. ఈ స్థలాన్ని కొంత మంది కబ్జా చేసి పశువుల కొట్టాలు వేసుకున్నారన్నారు. ప్రస్తుతం ఇక్కడే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శి నర్సిములుగౌడ్‌ దగ్గరుండి ఖబరస్తాన్‌ స్థలంలో ఇళ్లకు ముగ్గు పోయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి, కబ్జాలను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో అబ్దుల్‌ రజాక్‌, మైనార్టీ నాయకులు ఇద్రీస్‌, ఇర్ఫాన్‌, ఖుతుబ్‌, అజీజ్‌, మహబూబ్‌ తదితరులు ఉన్నారు.

తహసీల్దార్‌కు ముస్లిం నేతల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement