ఫుట్బాల్ టోర్నీ విజేత సీఎఫ్ షాప్ జట్టు
రేణిగుంట:కేంద్రీయ విద్యాలయ మైదానంలో శనివా రం నిర్వహించిన ఉద్యోగుల ఫుట్బాల్ టోర్నమెంట్ ఫైనల్లో సీఎఫ్ షాపు జట్టు గెలుపొందింది. సీబీఆర్ షాపు జట్టు రన్నర్గా నిలిచింది. సీఆర్ఎస్ చీఫ్ వర్క్స్ మేనేజర్ దేవ సహాయం విజేత జట్టు సభ్యులకు కప్పు, షీల్డులు బహూకరించారు. కార్యక్రమలో సీఆర్ఎస్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉదయ్కిరణ్, సెక్రటరీ గుణశేఖ ర్, అసిస్టెంట్ సెక్రటరీ రాబర్ట్, మజ్దూర్ యూనియన్ నాయకులు సురేంద్రరెడ్డి, మునిరాధయ్య, ఎంప్లాయీ స్ సంఘ్ నేతలు శ్రీనివాసులు, రవి, మునెయ్య, స్పోర్ట్స్ మాజీ సెక్రటరీ సదాశివరెడ్డి, ఉష పాల్గొన్నారు.