అంగన్‌వాడీల్లో ఖాళీలు భర్తీ చేయండి

మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి  - Sakshi

తిరుపతి అర్బన్‌: అంగన్‌వాడీల్లో పదోన్నతలు, ఖాళీల్లో జాప్యం చోటు చేసుకుందని, వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ కే.వెంకరమణారెడ్డి మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు, గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించిందని, ఆ మేరకు అధికారులు శ్రద్ధ చూపాలని చెప్పారు. 0–5 సంవత్సరాల చిన్నపిల్లల ఆధార్‌ నమోదు జిల్లాలో 58 శాతం పూర్తయిందన్నారు. సచివాలయ సిబ్బంది వీరి ఆధార్‌ నమోదుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. పాఠశాలల పనితీరుపై తరచూ పర్యావేక్షణ ఉండాలని ఆదేశించారు. స్పందనలో వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top