కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లా పరిధిలోని 5 కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2023–24లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ డాక్టర్ వీ.శేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతితో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి ఉన్న బాలికలు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 20వ తేదీలోపు ఏపీకేజీబీవీ.ఏిపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారానికి సమగ్ర శిక్ష అసిస్టెంట్ జీసీడీఓను 94418 63994నంబర్లో సంప్రదించాలని డీఈఓ సూచించారు.
ఎన్ఎంఎంఎస్కు 172 మంది ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్షకు తిరుపతి జిల్లా పరిధిలో 172 మంది విద్యార్థులు ఎంపికై నట్లు డీఈఓ డాక్టర్ వి.శేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా విద్యార్థులకు సంబంధించిన ఒరిజినల్ కుల, ఆదాయ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్, ఏడో తరగతి పరీక్షకు సంబంధించిన మార్కుల జాబితాను శుక్రవారం తిరుపతి డీఈఓ కార్యాలయంలోని ఎగ్జామినేషన్ సెక్షన్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల లోపు సమర్పించాలని సూచించారు.