26న బలిజ వధూవరుల వివాహ పరిచయ వేదిక
● 25వ తేదీ లోపు పేర్లను నమోదు చేసుకోవాలి
తిరుపతి కల్చరల్: తిరుపతి కర్నాల వీధిలోని హోటల్ శ్రీగురులక్ష్మిలో ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే బలిజ వధూవరుల వివాహ పరిచయ వేదిక విజయవంతం చేయాలని బలిజ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆళ్వారు మురళి పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం బలిజ సంఘ కార్యాలయంలో వారు వివాహ పరిచయ వేదిక కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్వారు మురళి మాట్లాడుతూ పరిచయ వేదికలో పాల్గొనదలిచిన వారు ఈనెల 25వ తేదీలోపు పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. మ్యాక్సీ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రావాల్సి ఉంటుందని చెప్పారు. తాము ఇచ్చే దరఖాస్తుల్లో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఎల్సీడీ ప్రాజెక్ట్ ద్వారా వివరా లు తెలియజేస్తామన్నారు. నచ్చిన వధూవరుల ఫోన్ నంబర్లు అందించి వారి వివాహానికి తమవంతు సహకారం అందజేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 99850 13529, 93983 14847 నంబర్లను సంప్రదించి ఈ అవకాశాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బలిజ కులస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలిజ జేఏసీ నేతలు రవీంద్ర, చెంచుకృష్ణ, సుబ్రమణ్యం, చిట్టిబాబు, శంకరప్ప, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.