Telangana: కొత్తగా 91 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 22,966 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, అందులో 91 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.89 లక్షలకు చేరుకుంది. తాజాగా 241 మంది కోలుకోగా, మొత్తం 7.84 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు వైరస్కు 4,111 మంది బలయ్యారు. ఇక ప్రస్తుతం 1,375 క్రియాశీలక కరోనా కేసులున్నాయి.