Telangana: కొత్తగా 41 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 13,158 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 41 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది. తాజాగా మరో 63 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7.86 లక్షల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.