తెలంగాణకు మాటలు, గుజరాత్‌కు మూటలు.. కేటీఆర్‌ ప్రశ్నల వర్షం

Telangana Minister KTR Fires On Pm Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ భేటీపై మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ‘‘మోదీ గారూ.. మీరు సామాజిక సేవకు ప్రయత్నిస్తున్నారా? మీరు నడుపుతున్నది ప్రభుత్వాన్నా లేక స్వచ్చంద సంస్థనా? హైదరాబాద్‌కు వరద సాయం నిధుల్లో పురోగతి ఏది?

మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు ఉదారంగా ఏదైనా సాయం చేస్తున్నారా? ఐటీఐఆర్‌ విషయంలో ఏమైనా పురోగతి ఉందా? హైదరాబాద్, తెలంగాణకు మాటలు.. గుజరాత్‌కు మాత్రం మూటలు..’’అని మంగళవారం రాత్రి ట్విట్టర్‌లో కేటీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

అభిమానికి కేటీఆర్‌ ఆతిథ్యం 
విజయవాడకు చెందిన శేఖర్‌ అనే కేటీఆర్‌ అభిమాని.. పాదయాత్రగా బయలుదేరి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల మీదుగా మంగళవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. కేటీఆర్‌ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర చేశారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్‌కు ప్రగతిభవన్‌లో భోజనం ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top