రాష్ట్రంలో కొత్తగా 836 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. గురువారం 38,122 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 836 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.17 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 765 మంది కోలుకోగా, ఇప్పటివరకు 8.08 లక్షలకు చేరాయి. ప్రస్తుతం 4,986 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.