Telangana: కొత్తగా 652 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 652 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,13,772 చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 8,04,950 మంది కోలుకున్నారు. మరో 4,711 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 4,111 మంది మృతిచెందారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 33,017కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.