Telangana: 111 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 10,288 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 111 మంది వైరస్ బారిన ప డ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8.36 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో 129 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.31 లక్షలకు చేరింది. ప్రస్తుతం 856 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.