క‌రోనా: తెలంగాణ‌లో ఒక్క‌రోజే 12 మంది మృతి

In The Last 24 Hours 12 People Died In Telangana Due To Covid 19  - Sakshi

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 1896 కరోనా కేసులు న‌మోదుకాగా 12 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య  1,201కి చేరింది. కొత్తగా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 294 కేసులు న‌మోదు అయ్యాయి. త‌ర్వాతి స్థానాల్లో రంగారెడ్డి 211 కేసులు, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 154 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,644గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. క‌రోనా కేసులు పెరుగుతున్నా రిక‌వ‌రీ రేటు కూడా అదే స్థాయిలో న‌మోద‌వుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,79,075 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో  ప్ర‌స్తుతం 26,368 యాక్టివ్ కేసులున్న‌ట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.  (స్కూళ్లు, థియేటర్లపై నిర్ణయం వాయిదా )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top