పల్లెలకు పాకిన కరోనా
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఆందోళనలో ప్రజలు
భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 87 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 39, నల్లగొండలో 44, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. కాగా భువనగిరి పట్టణానికి చెందిన 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు గురువారం ఒక ప్రకనలో తెలిపారు. పట్టణంలోని కిసాన్నగర్కు చెందిన ఒక్కరు, బంజారాహీల్స్కు చెందిన ముగ్గురు, పట్టణంలోని ఇతర ప్రాంతాలకు చెందిన మరో 8 మందికి కరోనా వచ్చినట్లు పేర్కొన్నారు.
నేరేడుచర్లలో ఏడు కేసులు
నేరేడుచర్ల : నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి, పెంచికల్దిన్నె ఆరోగ్యకేంద్రంలో నలుగురికి కరోనా టెస్టులు చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాదికారులు నాగయ్య, ఆరిఫ్ తెలిపారు.
ఆలేరు మండలంలో ఆరుగురికి...
ఆలేరు రూరల్ : ఆలేరులోని ప్రభుత్వ వైద్యశాలలో గురువారం 20 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా రెడ్డిగూడెంకు చెందిన ఇద్దరికి, రంగనాయక వీధిలో ముగ్గురికి, అలాగే మరొకరికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారిణి జ్యోతిబాయి తెలిపారు.
చౌటుప్పల్లో మరో ఐదుగురికి...
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలంలో మరో ఐదుగురు కరో నా బారినపడినట్లు మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎం.శివప్రసాద్రెడ్డి తెలిపారు. 18 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి, హైదరాబాద్లో టెస్ట్ చేయించుకున్న మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.
సర్వారంలో రెండు కేసులు...
గరిడేపల్లి : మండలంలోని సర్వారంలో గురువారం రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు కల్మల్చెర్వు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుధీర్ కుమార్ తెలి పారు. గ్రామానికి చెందిన ఓ గర్భిణి కాన్పు కోసం హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా కాన్పు సమయంలో వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అదే విధంగా గ్రామంలో మరో యువకుడికి పాజిటివ్గా తేలినట్లు పేర్కొన్నారు.
ఆమలూరులో ఒకరికి...
గుర్రంపోడు : మండలంలోని ఆమలూరులో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి నవనీత తెలిపారు. గ్రామానికి చెందిన 40 ఏళ్ల వయస్సు గల వ్యక్తి జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికిరాగా గురువారం కరోనా టెస్ట్ కిట్ ద్వారా పరీక్ష చేయగా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు తెలిపారు.
చందేపల్లి యువకుడికి...
మోటకొండూర్ : మండలంలోని చందేపల్లిలో యువకుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రాజేందర్నాయక్ తెలిపారు. కరోనా సో కిన యువకుడు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నాంపల్లి మండలంలో ఒకరికి...
నాంపల్లి : మండలంలోని దేవత్పల్లి గ్రామంలో మేస్త్రీ పని చేసే వ్యక్తికి గురువారం కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతడితో పని చేసే వ్యక్తికి కరోనా రావడంతో ఈయనకు కూడా సోకినట్లు తెలిసింది.
పీఏపల్లి మండలంలో రెండు ...
పెద్దఅడిశర్లపల్లి : పెద్దఅడిశర్లపల్లి మండలంలోని బాలాజీనగర్లో ఓ యువకుడికి, అంగడిపేట ఎక్స్రోడ్డులో నివాసముంటూ గ్రామ పంచాయతీ కా ర్యదర్శిగా పని చేస్తున్న మహిళ భర్తకు కరోనా పా జిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారులు తెలిపారు.
తిప్పర్తిలో ఇద్దరికి...
రామగిరి(తిప్పర్తి) : తిప్పర్తి మండలంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారులు ధృవీకరించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారికి, పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
గోండ్రియాలలో 60 ఏళ్ల వ్యక్తికి...
అనంతగిరి : మండల పరిధిలోని గోండ్రియాల గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కరోనా వచ్చినట్లు డా.సుధీర్ చక్రవర్తి తెలిపారు. బాధితుడిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు.
వెలుగుపల్లిలో వ్యక్తికి...
తుంగతుర్తి : మండల పరిధిలోని వెలుగుపలికి చెందిన ఆర్టీసీ డ్రైవర్కు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ నాగునాయక్ తెలిపారు.
తిరుమలగిరిలో ఒకరికి...
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరికి చెందిన ఓ మ హిళకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి ప్రశాంత్బాబు తెలిపారు.
నడిగూడెం మండలంలో ఒకరికి...
నడిగూడెం : నడిగూడెం మండలం కరివిరాల ఆవాస గ్రా మం వెంకట్రాంపురానికి చెందిన 25 సంవత్సరాల యుకుడికి కరోనా వైరస్ సోకినట్లు మండల వైద్యాధికారిణి లక్ష్మీప్రసన్న తెలిపారు.
కోమటికుంటలో ఒకరికి...
చివ్వెంల : కోమటికుంటలో మహిళకి కరోనా సోకినట్లు మండల వైద్యాధికారి శ్రీనివాస్ రాజ్ తెలిపారు.