హైకోర్టు జడ్జిల తేనీటి విందుకు హాజరైన సీజేఐ
సాక్షి, హైదరాబాద్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లి నివాసంలో ఏర్పాటు చేసిన హైకోర్టు జడ్జిల తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ తేటిని విందుకు ఏపీ హైకోర్టు సీజే అరూప్కుమార్ గోస్వామితో పాటు పలువురు తెలంగాణ న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి తెలంగాణకు వచ్చారు. ప్రస్తుతం రాజ్భవన్లో బస చేస్తున్నారు.