తెలంగాణలో కొత్తగా 2,534 కరోనా కేసులు

2534 New Coronavirus Positive Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,534 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,176కు చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 11 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. బుధవారం ఒక్కరోజే 2,071 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,17,143. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,106. (  ప్రాణాంతకంగా ‘లిఫ్ట్‌ బటన్‌’ )

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.83 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 78.5 శాతంగా ఉంది. భారత్‌లో మరణాల రేటు 1.68 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.61 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 63,017 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 19,53,571కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top