తెలంగాణలో కొత్తగా 213 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం 39,495 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 213 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పటివరకు 6,76,787 మంది కరోనా బారిన పడగా, వీరిలో 6,69,010 మంది కోలుకున్నారు. మరో 3,779 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో శనివారం ఒకరు మరణించగా, ఇప్పటివరకు 3,998 మంది మృత్యువాత పడ్డట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఎయిర్పోర్టు ల్యాబ్కు షోకాజ్ నోటీసు
అంతర్జాతీయ విమానాశ్రయంలోని కరోనా పరీక్షల కేంద్రానికి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ షోకాజ్ నోటీ సులు జారీచేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ప్రభు త్వం నిర్దేశించిన విధంగా రూ.500 ఫీజు తీసుకోవాల్సి ఉండగా, రూ.900 వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో ఈ చర్యలు తీసుకుంది.