తైలాపురంలో పోలీసు విచారణ | - | Sakshi
Sakshi News home page

తైలాపురంలో పోలీసు విచారణ

Jul 18 2025 5:16 AM | Updated on Jul 18 2025 5:16 AM

తైలాపురంలో పోలీసు విచారణ

తైలాపురంలో పోలీసు విచారణ

2 రోజులలో తేలుతుందన్న రామన్న

సాక్షి, చైన్నె: తైలాపురంలో ట్యాపింగ్‌ పరికరం లభించినట్టుగా వచ్చిన సమాచారంతో విల్లుపురం జిల్లా పోలీసు యంత్రాంగం అదనపు డీఎస్పీ నేతృత్వంలో బృందాన్ని రంగంలోకి దించింది. సైబర్‌ టీంతో కూడిన ఈ బృందం గురువారం తైలాపురం గెస్ట్‌ హౌస్‌లో తనిఖీలు చేసినట్టు సమాచారం వెలువడింది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న అధికార సమరం పలు ధారావాహికల తరహాలో అనేక ట్విస్టులతో సాగుతున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజులలో ఈ వివాదానికి తెర పడుతుందని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. అదే సమయంలో రాందాసు నివాసం తైలాపురం గెస్ట్‌ హౌస్‌లో ట్యాపింగ్‌ పరికరం సోఫా కింద లభించడం కలకలం రేపింది. దీనిపై విచారణ చేసే విధంగా డీజీపీకి రాందాసు తరపున ఓ వినతి పత్రం ఈ మెయిల్‌ ద్వారా పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులలో సైబర్‌ క్రైం బృందంతో కూడిన అదనపు డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు తైలాపురంలో తనిఖీలు చేశారు. ట్యాపింగ్‌ పరికరాన్ని పరిశీలించినట్టు, అక్కడి పార్టీ వర్గాలు, సెక్యూరిటీ సిబ్బందిని విచారించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. కాగా, ఈ ట్యాపింగ్‌ పరికరం గురించి రాందాసు మీడియాతో మాట్లాడుతూ, ఈ పరికరాన్ని ఎవ్వరు ఇక్కడకు తీసుకొచ్చి పెట్టారో అన్నది రెండు రోజులలో తేట తెల్లం అవుతుందన్నారు. తాను ఏం మాట్లాడుతున్నానో, ఎవరితో సమావేశాలు నిర్వహిస్తున్నానో అన్న వివరాలను ట్యాపింగ్‌ చేసి ఎవరికి ఎవరు పంపించారో అన్న సమగ్ర వివరాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement