చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్య దైవంగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మ తల్లి దీవెనల కోసం భక్తులు బోయకొండకు బుధవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోయకొండ ఎటుచూసినా జనసంద్రంగా మారింది. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఒక్క రోజే 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.
భక్తులతో బోయకొండ కిటకిట