
● నేడు చిదంబరంలో శ్రీకారం ● 46 సేవలకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, చైన్నె: ఎన్నికల వాగ్దానంగా ఏడాదిన్నర్న క్రితం కలైంజ్ఞర్ మగళిర్ ఉరిమై తిట్టం( మహిళా హక్కు పథకం)ను ద్రావిడ మోడల్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తొలి విడతగా కోటి 6 లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఈ మేరకు అర్హులైన గృహిణులకు నెలకు రూ. వెయ్యి నగదు బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరుగుతోంది. అదే సమయంలో తమ కంటే తమకు లబ్ధి చేకూరడం లేదంటూ మహిళలు నినదించడంతో మరోమారు దరఖాస్తులు ఆహ్వానించగా, 11 లక్షల మందికి పైగా మహిళా అప్పీలు విజ్ఞప్తిని దాఖలు చేసుకున్నారు. వీటిని సమగ్రంగా పరిశీలించి సుమారు 7.35 లక్షల లక్షల మందికి వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా కోటి 15 లక్షల మంది మహిళలకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు. అయినా తమ కంటే తమకు రావడం లేదని నినదించే వారి సంఖ్య అధికంగానే ఉంది. అదే సమయంలో కొన్ని నిబంధనల కారణంగా అర్హులైన మహిళలు ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం స్టాలిన్ అర్హులైన మహిళలు అందరికి పథకం వర్తింపజేయడమే లక్ష్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నిబంధనలను సడలించారు.
ఇంటింటా దరఖాస్తులు..
మీతో స్టాలిన్ నినాదాన్ని మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా స్వచ్ఛంద సేవకులు లక్ష మంది ద్వారా ఇంటింటా దరఖాస్తులు, సమాచార బుక్లెట్ల పంపిణీ ఇప్పటికే విస్తృతంగా జరుగుతోంది. మీతో స్టాలిన్ గురించి ఈ పథకం ప్రత్యేక అధికారి అముదా ఐఎఎస్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజల విజ్ఞప్తులకు త్వరితగతిన పరిష్కారం దిశగా ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటున్నట్టు గుర్తుచేశారు. గతంలో మీ నియోజకవర్గంలో సీఎం కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. చైన్నె సచివాలయంలోని సీఎం సెల్కు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతున్నదన్నారు. అదే సమయంలో ప్రజలు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, తమకు కావాల్సిన పథకాలు, లబ్ధి, ప్రయోజనాలను సత్వరంగా పొందేందుకు వీలుగానే మీతో స్టాలిన్ తొలి విడతగా ఆగస్టు 15వ తేది వరకు జరుగుతుందన్నారు. వాస్తవానికి నవంబర్ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, ప్రజల నుంచివచ్చే స్పందన మేరకు ఆగస్టు 15 తర్వాత మరింత విస్తృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, తమ విజ్ఞప్తులను అధికారుల దృష్టికి తెచ్చిపరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చారు. ఇక్కడకు వచ్చే ఫిర్యాదులన్నీ 45 రోజులలోపు పరిష్కరించ బడుతాయని వివరించారు. ఇది వరకు 20 వేల మంది ప్రజలకు ఒక శిబిరం ఏర్పాటు చేశామని, తాజాగా 10 వేల మందికి ఓ శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్నామన్నారు. గత నాలుగు సంవత్సరాలలో 1.05 కోట్ల విజ్ఞప్తులు రాగా 1.01 కోట్లు పరిష్కరించ బడ్డాయని వివరించారు. కాగా చిదంబరం పర్యటన నిమిత్తం సీఎంస్టాలిన్ రైలులో ప్రయాణించారు. చైన్నె తాంబరం రైల్వే స్టేషన్ నుంచి రామేశ్వరం ఎక్స్ప్రెస్ రైలులో చిదంబరానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల డీఎంకే వర్గాలు,అధికారులు, మంత్రులు వీడ్కోలు పలికారు.
చిదంబరానికి రైలులో బయలుదేరిన సీఎం
లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకు..
తాంబరం స్టేషన్లో డీఎంకే వర్గాల వీడ్కోలు
రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాలలోని 43 నుంచి 46 సేవలను ప్రజలు త్వరితగతిన పొందేందుకు వీలుగా మీతో స్టాలిన్ నినాదంతో శిబిరాల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. కడలూరు జిల్లా చిదంబరంలో మంగళవారం మీతో స్టాలిన్ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో ప్రత్యేకంగా మహిళా హక్కు పథకం కోసం మరింతగా లబ్దిదారులకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
కొత్తగా ఈ మగళిర్ ఉరిమి తిట్టంకోసం దరఖాస్తులు చేసుకోదలచని వారికి అవకాశం కల్పించడమే కాకుండా, ప్రభుత్వ విభాగాలలోని 43 నుంచి 46 సేవలను ప్రజలు సులభంగా పొందేందుకు వీలుగా మీతో స్టాలిన్కార్యక్రమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు 10 వేల శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. కడలూరు జిల్లా చిదంబరం వేదికగా ఈ శిబిరాలకు సీఎం స్టాలిన్ మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. నవంబర్ వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. తమిళనాడులోని లక్షలాది మంది ప్రజలు రోజూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,768 శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 6,232 శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో పట్టణ ప్రాంతాల్లోని 13 ప్రభుత్వ విభాగాల నుంచి 43 సేవలు అందుబాటులో ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో 15 విభాగాలకు చెందిన 46 సేవలు అందించనున్నారు. ఒక్క మహిళా హక్కు పథకమే కాదు, వివిధ ప్రభుత్వ శాఖల పథకాలు, సేవలను వివరించే విధంగా, వాటి ప్రయోజనాలు, అర్హతల గురించి అవసరమైన సమగ్ర సమాచారాలను బుక్ లెట్ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. శిబిరం రోజున అర్హతగల మహిళలు అధికారుల్ని సంప్రదించి మహిళ హక్కు పథకం దరఖాస్తును సమర్పించే వీలు కల్పించారు. ఈ శిబిరాలలో స్వీకరించే దరఖాస్తులను 45 రోజులలో పరిష్కరించే విధంగా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తుంటారు. కొన్నింటిని అప్పటికిప్పుడే పరిష్కరించేందుకు సైతం శిబిరాలలోచర్యలు తీసుకున్నారు.

● నేడు చిదంబరంలో శ్రీకారం ● 46 సేవలకు దరఖాస్తుల స్వీకరణ

● నేడు చిదంబరంలో శ్రీకారం ● 46 సేవలకు దరఖాస్తుల స్వీకరణ

● నేడు చిదంబరంలో శ్రీకారం ● 46 సేవలకు దరఖాస్తుల స్వీకరణ