గ్రీవెన్స్‌డేలో 415 వినతులు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌డేలో 415 వినతులు

Jul 8 2025 5:08 AM | Updated on Jul 8 2025 5:08 AM

గ్రీవెన్స్‌డేలో 415 వినతులు

గ్రీవెన్స్‌డేలో 415 వినతులు

తిరువళ్లూరు: కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో 415 వినతులు వచ్చినట్టు కలెక్టర్‌ ప్రతాప్‌ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్‌డేను నిర్వహించారు. ఇందులో పట్టాల కోసం 45 వినతులు, పక్కాగృహాల కోసం 60, ఉపాధి కోసం 50, మౌలిక సదుపాయాలతో సహా ఇతర వాటి కోసం 193 వినతులతో కలిపి మొత్తం 415 వినతులు వచ్చాయి. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్‌ ప్రతాప్‌, వాటిని తక్షణం పరిస్కరించాలని ఆదేశించారు. అనంతరం దాదాపు గంట పాటూ అధికారులతో గత వారం స్వీకరించిన వినతులపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్వో సురేష్‌, పీఏజీ వెంకట్రామన్‌, స్పెషల్‌ తాహసీల్దార్‌ బాలమురుగన్‌తో తదితరులు పాల్గొన్నారు. కాగా గ్రీవెన్స్‌డేకు రెవెన్యూ, పోలీసులు, పీడబ్ల్యూడీ, గ్రామీణాభివృద్ధి, అగ్నిమాపశాఖ, ఎడ్యుకేషన్‌, సర్వేయర్‌ విభాగంతో పాటూ అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement